Monday, November 26, 2012

ఎక్కడికి పోతోంది ఈ వ్యవస్థ?

1948 నాటికి నాకు సరిగ్గా తొమ్మిదేళ్ళు. మహాత్మాగాంధీ హత్య జరిగింది. అదెంత నష్టమో, జాతి ఎంతగా కృంగిపోయిందో అర్ధం చేసుకునే వయస్సు కాదు. కానీ ఆనాడు విశాఖపట్నమంతా - ముస్లింలు, హిందువులు, పెద్దా చిన్నా - అంతా సముద్రతీరానికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ సముద్ర స్నానం చెయ్యడం నాకు గుర్తుంది. నా చేత కూడా మా అమ్మా నాన్నా స్నానం చేయించారు. ఓ మహాత్ముడి నిర్యాణానికి దేశ ప్రజలు సమర్పించిన నివాళి అది. అది హత్య. మరణం కాదు.
మరో 39 సంవత్సరాల తర్వాత ప్రముఖ సినీనటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్ర అనారోగ్యంతో మరణించారు. ప్రజలు చెలరేగిపోయి దుకాణాలు ధ్వంసం చేసారు. బస్సుల్ని తగలెట్టారు. మందు షాపుల్ని దోచుకున్నారు. 23 మంది చచ్చిపోయారు. 47 మంది పోలీసులు గాయపడ్డారు.. కనీసం ఒక్కడు దోచుకున్న మందు షాపుల్లో మందుని తప్పతాగి రోడ్డుమీద పడి చచ్చాడు.
పూర్తిగా చదవండి

Monday, November 19, 2012

హాస్యపు కరువు

ఆ మధ్య నాగపూర్ కార్టూనిస్టు ఆసీం త్రివేదీని - కార్టూన్లు వేసినందుకు దేశద్రోహ నేరానికి అరెస్టు చేసినప్పుడు - ఈ పాలక వ్యవస్థకి, నాయకులకీ బొత్తిగా హాస్యపు రుచి తెలియదని చాలామంది దుమ్మెత్తిపోశారు.
పార్లమెంటుని పాయిఖానా తొట్టిగా, సత్యమేవ జయతే అన్న జాతీయ ఆదర్శాన్ని 'భ్రమేవ జయతే ' అన్నప్పుడు, ఆజ్మాల్ కసాబ్ ఈ దేశపు రాజ్యాంగం మీద ఉచ్చ పోసినప్పుడు - పాలక వ్యవస్థకి, నాయకులకీ బొత్తిగా హాస్యపు రుచి తెలియదని చాలామంది దుమ్మెత్తిపోశారు.
పూర్తిగా చదవండి

Sunday, November 4, 2012

అన్నీ ఉన్నవాడే..ఏమీ లేనివాడు

ఇంటర్నెట్ లో చాలా మంది మిత్రులు - ప్రపంచం అన్ని మూలల నుంచీ రకరకాల కథలు, సందర్భాలను ఉటంకిస్తూంటారు. ఇది నలుగురితో పంచుకోవలసినంత గొప్ప సగతి:


1923 లో అమెరికాలోని చికాగోలో ఉన్న ఎడ్జి వాటర్ బీచ్ హోటల్ లో దేశంలో కల్లా శ్రీమంతులైన తొమ్మిది మంది కలుసుకున్నారు. వాళ్ళందరి ఆస్తుల్ని కలిపితే ఆనాటి అమెరికా దేశపు సంపద కన్నా ఎక్కువ. డబ్బుని ఎలా సంపాదించాలో, ఎలా కూడబెట్టాలో వంటబట్టించుకున్న మహానుభావులు వీరు తొమ్మిది మంది.

పూర్తిగా చదవండి