Monday, November 26, 2012

ఎక్కడికి పోతోంది ఈ వ్యవస్థ?

1948 నాటికి నాకు సరిగ్గా తొమ్మిదేళ్ళు. మహాత్మాగాంధీ హత్య జరిగింది. అదెంత నష్టమో, జాతి ఎంతగా కృంగిపోయిందో అర్ధం చేసుకునే వయస్సు కాదు. కానీ ఆనాడు విశాఖపట్నమంతా - ముస్లింలు, హిందువులు, పెద్దా చిన్నా - అంతా సముద్రతీరానికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ సముద్ర స్నానం చెయ్యడం నాకు గుర్తుంది. నా చేత కూడా మా అమ్మా నాన్నా స్నానం చేయించారు. ఓ మహాత్ముడి నిర్యాణానికి దేశ ప్రజలు సమర్పించిన నివాళి అది. అది హత్య. మరణం కాదు.
మరో 39 సంవత్సరాల తర్వాత ప్రముఖ సినీనటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్ర అనారోగ్యంతో మరణించారు. ప్రజలు చెలరేగిపోయి దుకాణాలు ధ్వంసం చేసారు. బస్సుల్ని తగలెట్టారు. మందు షాపుల్ని దోచుకున్నారు. 23 మంది చచ్చిపోయారు. 47 మంది పోలీసులు గాయపడ్డారు.. కనీసం ఒక్కడు దోచుకున్న మందు షాపుల్లో మందుని తప్పతాగి రోడ్డుమీద పడి చచ్చాడు.
పూర్తిగా చదవండి

No comments:

Post a Comment