Sunday, February 24, 2013

మృత్యువు

మృత్యువు జీవితాన్ని అడిగిందట: నన్ను చూసి అందరూ అసహ్యించుకుంటారు. భయపడతారు. కాని నిన్ను ప్రేమిస్తారేం? -అని. జీవితం సమాధానం చెప్పింది: ''ఎందుకంటే నేను అందమయిన అబద్ధాన్ని. నువ్వు తప్పనిసరయిన, బాధాకరమైన నిజానివి'' అని.
నా కాలేజీ రోజుల్లో చదివాను దువ్వూరి రామిరెడ్డి గారి 'పానశాల'. ఆయన మృత్యువు గురించి అంటారు: ''అయయో మూలధనమ్ము హస్తగళితమ్మౌచుండె నానాటికిన్‌, వ్యయమై పోయిరి మానవుల్‌ మరణశయ్యాసుప్తులై...''. అయ్యో, చేతిలో ఉన్న మూలధనం ప్రతీదినం జారిపోతోంది. మానవులు మృత్యువుని చేరి ఖర్చయిపోతున్నారు -అని.
పూర్తిగా చదవండి

1 comment:

  1. తప్పిపోయిన మృత్యువు గురించీ, వెంటాడి మరీ కలుసుకున్న మృత్యువు గురించీ మీరు రాసిన సంఘటనలు జలదరింపజేశాయి.

    సూరయ్య గురించి మీ వ్యాఖ్యానం చాలా బాగుంది. అలాంటివాళ్ళు పట్టణాల్లో కనపడకపోవచ్చు కానీ, పల్లెల్లో తారసపడుతూనే ఉంటారు!

    ReplyDelete