Monday, January 24, 2011

'ఆదర్శ' అవినీతి....

ముంబైలో 'ఆదర్శ ' హౌసింగ్ సొసైటీ కుంభకోణం 31 అంతస్థుల భవనాన్ని కూలద్రోయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రి జైరాం రమేష్ గారు ఈ నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. ఇది మరీ పెద్ద అవినీతి అని నా ఉద్దేశం. ఒక రొట్టెముక్క ఉంది. వెంకయ్య తినాలా రామయ్య తినాలా అన్నది తగువు. మధ్యవర్తి వచ్చి ఎవరూ తినకూడదు అంటూ తను నోట్లో వేసుకోవడం ఫక్తు 'కాంగ్రెసు' తీర్పు. దీనికే పాతకాలం సామెత ఒకటుంది - పిల్లీ పిల్లి తగువు కోతి తీర్చిందని. కాని ఎవరూ తినకూడదు అంటూ సముద్రంలోకి గిరాటు వెయ్యడం - జైరాం రమేష్ గారు ఇవ్వవలసిన తీర్పు కాదు.

5 comments:

  1. నిజమే గురువుగారూ!
    వేలికి పుండు అయితే కాలు మొత్తం కోసేసి నట్టుంది.
    మీరు సినిమాల్లో వేసినప్పటి విలనిజం కి ఇప్పటి విలన్లకి తేడా గమనించారా (వీలైతే వాటి మీద ఓ కాలమ్ రాయండి) ప్లీజ్

    ReplyDelete
  2. గురువు గారూ,
    మన వాళ్ళ అవినీతి కథలకీ, ఫొటో లకీ 32 అంతస్థులు చాలుతాయంటారా?
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    ReplyDelete
  3. అమెరికా వారి కంటే మీ సెన్సాఫ్ హ్యూమర్ కి హేట్సప్.. మీరు చెప్పింది వాస్తవం... నిజంగా ఈ 'ఆదర్శ' భవనాన్ని మ్యూజియంగా మార్చితే.. చాలా మంది సందర్శకులు చీ కొట్టచేమో.. కొంత మందిలో అయినా.. మార్పు రావచునేమో..

    ReplyDelete
  4. శ్రి,


    చాల బాగుంది.


    అవును, దీంట్లో పాపం వై యస్ జగన్ గారిని వదిలేసారు.ఏమి బాగోలేదు

    లేకపోతే ఆయన తిన్నది చాలలేదా?

    పాపం ఆయన గురించి కూడ రాయండి సార్
    థాంక్యు

    లలిత

    ReplyDelete