Monday, July 4, 2011

దేవుడికి జ్వరమొచ్చింది

మన దేవుళ్లు ఒకొక్కప్పుడు మనకంటే బలహీనులు. బొత్తిగా ఆరోగ్యాన్ని నిలుపుకోలేనివాళ్లు.
ప్రతీ సంవత్సరం ఆషాడమాసంలోనే జగన్నాధుడికి జ్వరం వస్తుంది. ఎందుకని? ఆయనకి
108
కలశాలతో అభిషేకం జరిగినందుకు. జలుబుచేసి, ముక్కు దిబ్బడవేసి జ్వరం ప్రారంభమవుతుంది. భక్తులు ఆయనకి రకరకాలయిన లేహ్యాలను సిద్ధం చేస్తారు. అంతేకాదు. ఆయన సోదరుడు బలభద్రుడు, దేవేరిలతో మూడు రధాలతో బయల్దేరదీసి- వేరే ఏకాంతమందిరంలో వుంచుతారు. అక్కడ ఆయనకి 15 రోజులపాటు అభిషేకాలు లేవు. దేవుడు పత్యం చేస్తాడు. జలుబు తగ్గి ఆరోగ్యం పుంజుకున్నాక- మళ్లీ స్వస్థలానికి వస్తాడు.



4 comments:

  1. అద్భుతం గురువు గారూ.
    మీ విశ్లేషణతో చాలా మంది మన పురాణాలనీ, దేవుళ్ళ లీలలనీ (మీరు చెప్పినట్లు మనం కల్పించుకున్నవే అయినా) విమర్శించడం మాని వాటిలోని ఆధ్యాత్మిక భావాలని అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
    నా 'అంతర్యామి' కవితలో చివరి భాగం ఇక్కడ ప్రస్తావించాలని ఆశ.
    " నీ పరమార్ఢం -
    నువ్వు వెతుక్కునే సంతోషం లో లేదు,
    నువ్వు నిన్ను తెలుసుకుంటే
    నీ లోనే దొరుకుతుంది "

    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    విన్నపం: కుళ్ళు రాజకీయలపై కాకుండా ఇటువంటి సంస్కృతీ సాంప్రదాయల విషయాలకి 'మారుతీయం ' వేదిక కావాలని నా కోరిక

    ReplyDelete
  2. అవునండీ. ఇతర మతాలలో దేవుడు అంటే దండించేవాడు లేకపోతే మనుషులు అందరూ పాపులు అని అనుకుంటారు. కానీ మన హిందూ ధర్మం లో మనిషికి దేముడు తల్లి, తండ్రి, సోదరుడు, స్నేహితుడు కూడా. అంతేకాక మనిషి దేముడు లో ఒక చిన్న భాగం కూడా

    ReplyDelete
  3. గొల్లపూడి వారూ, బ్రహ్మాండమైన వివరణ, విశ్లేషణ. బహు చక్కగా వర్ణించారు. పరమాత్మ, పారమార్దికం అంశాలపై భేషైన ప్రసంగం. ఇటువంటి మంచి అంశాన్ని ఎంచుకుని మా పాఠకులను ఆనంద డోలికల్లో ముంచారు. ధన్యవాదాలు.

    -దక్షిణామూర్తి

    ReplyDelete