ప్రియమైన సోదరులారా!
ఈ మధ్య కాలంలో మీ గురించి ఈ దేశ ప్రజలు ఆలోచిస్తున్నట్టు మా తల్లిదండ్రులు, ఆత్మీయుల గురించి కూడా ఆలోచించడంలేదు. అందుకు బోలెడన్ని కారణాలున్నాయి. పాకిస్థాన్ మిత్రులకి 'కాశ్మీర్' ఊతపదం. కానీ మాకు మీ దౌర్జన్యకాండలు ఊతపదం. అయితే మీరు చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు. మీలో చిన్న అవగాహనా లోపం ఉంది. దాన్ని తొలగించడానికే ఈ ఉత్తరం. చిత్తగించండి.
Monday, July 25, 2011
Monday, July 18, 2011
అమెరికా కర్మ సిద్ధాంతం
అమెరికాలో అన్నిటికన్నా ఆకర్షించే విషయం- వ్యాపారం. సర్వకాలసర్వావస్థలలోనూ వీటిని అమ్మవచ్చా, వీటికి బేరం ఉంటుందా, యిలాకూడా వ్యాపారం చెయ్యవచ్చా అనిపించేరీతిగా నిత్యనూతనంగా- ఎప్పుడూ కొత్త కొత్త తాయిలాలను, వరాలను కురిపిస్తూ- ఎన్నటికీ అలసిపోని, ఎప్పుడూ సాగే కర్మకాండ వ్యాపారం
Monday, July 11, 2011
ఓ అరుదైన సాయంకాలం
మహానటి సావిత్రి నా మొదటి సినీమా (డాక్టర్ చక్రవర్తి) హీరోయిన్. నా ఆఖరి రేడియో నాటకం హీరోయిన్. ఈ రెండు సంఘటనల మధ్య ఆమె జీవితంలో జరిగిన అన్ని ముఖ్యమయిన ఘట్టాలూ పరుచుకున్నాయి. ఆకాశం ఎత్తుకి ఎగసిన కీర్తి ప్రతిష్టలున్నాయి. కృంగదీసిన అపజయాలున్నాయి. అనారోగ్యం ఉంది. నిస్సహాయమైన జీవన విధానం ఉంది
Monday, July 4, 2011
దేవుడికి జ్వరమొచ్చింది
మన దేవుళ్లు ఒకొక్కప్పుడు మనకంటే బలహీనులు. బొత్తిగా ఆరోగ్యాన్ని నిలుపుకోలేనివాళ్లు.
ప్రతీ సంవత్సరం ఆషాడమాసంలోనే జగన్నాధుడికి జ్వరం వస్తుంది. ఎందుకని? ఆయనకి 108 కలశాలతో అభిషేకం జరిగినందుకు. జలుబుచేసి, ముక్కు దిబ్బడవేసి జ్వరం ప్రారంభమవుతుంది. భక్తులు ఆయనకి రకరకాలయిన లేహ్యాలను సిద్ధం చేస్తారు. అంతేకాదు. ఆయన సోదరుడు బలభద్రుడు, దేవేరిలతో మూడు రధాలతో బయల్దేరదీసి- వేరే ఏకాంతమందిరంలో వుంచుతారు. అక్కడ ఆయనకి 15 రోజులపాటు అభిషేకాలు లేవు. దేవుడు పత్యం చేస్తాడు. జలుబు తగ్గి ఆరోగ్యం పుంజుకున్నాక- మళ్లీ స్వస్థలానికి వస్తాడు.
ప్రతీ సంవత్సరం ఆషాడమాసంలోనే జగన్నాధుడికి జ్వరం వస్తుంది. ఎందుకని? ఆయనకి 108 కలశాలతో అభిషేకం జరిగినందుకు. జలుబుచేసి, ముక్కు దిబ్బడవేసి జ్వరం ప్రారంభమవుతుంది. భక్తులు ఆయనకి రకరకాలయిన లేహ్యాలను సిద్ధం చేస్తారు. అంతేకాదు. ఆయన సోదరుడు బలభద్రుడు, దేవేరిలతో మూడు రధాలతో బయల్దేరదీసి- వేరే ఏకాంతమందిరంలో వుంచుతారు. అక్కడ ఆయనకి 15 రోజులపాటు అభిషేకాలు లేవు. దేవుడు పత్యం చేస్తాడు. జలుబు తగ్గి ఆరోగ్యం పుంజుకున్నాక- మళ్లీ స్వస్థలానికి వస్తాడు.
Sunday, June 26, 2011
ఆసుపత్రికి తోవ ఎటు?
ఈ మధ్య టీవీలో ఒక ఆలోచనాభరితమైన చర్చని చూశాను.
మందు ఆ చర్చకి ప్రాతిపదిక. మహారాష్ర్ట ప్రభుత్వం పిల్లలు మద్యం తాగే వయస్సుని 21 నుంచి 25కి పెంచారు. అమితాబ్ బచ్చన్ గారికి కోపం వచ్చింది. అలా పెంచడం అన్యాయమని ఆయన వాపోయారు. ఈ టీవీ చర్చ ముఖ్యోద్దేశం ఏమిటంటే - అలా పెంచడం ద్వారా పిల్లలు తమకేం కావాలో నిర్ణయించుకునే హక్కుని కోల్పోతున్నారని పెద్దలు కొందరు వాక్రుచ్చారు. పెద్దల బుద్దులు ఎలా వెర్రితలలు వేస్తున్నాయో మనం అనునిత్యం చూసి ఆనందిస్తున్నాం. జైల్లోనే డాక్టర్ సచాన్ హత్య, బీహార్ లో ధర్నా చేస్తున్న రైతును తొక్కి చంపిన పోలీసుల వీరంగం, కోట్ల ధనం దోపిడీ- ఇవన్నీ మనం రోజూ చూసే సుందర దృశ్యాలు. పాతికేళ్ళ లోపునే మందు తాగే విచక్షణ యువకులకు ఉన్నదని వీరి వాదన. టీవీలో ఈ చర్చ వీలయినంత అసహ్యంగా, అసందర్భంగా, ఆలోచనారహితంగా కనిపించింది నాకు.
పూర్తిగా చదవండి
మందు ఆ చర్చకి ప్రాతిపదిక. మహారాష్ర్ట ప్రభుత్వం పిల్లలు మద్యం తాగే వయస్సుని 21 నుంచి 25కి పెంచారు. అమితాబ్ బచ్చన్ గారికి కోపం వచ్చింది. అలా పెంచడం అన్యాయమని ఆయన వాపోయారు. ఈ టీవీ చర్చ ముఖ్యోద్దేశం ఏమిటంటే - అలా పెంచడం ద్వారా పిల్లలు తమకేం కావాలో నిర్ణయించుకునే హక్కుని కోల్పోతున్నారని పెద్దలు కొందరు వాక్రుచ్చారు. పెద్దల బుద్దులు ఎలా వెర్రితలలు వేస్తున్నాయో మనం అనునిత్యం చూసి ఆనందిస్తున్నాం. జైల్లోనే డాక్టర్ సచాన్ హత్య, బీహార్ లో ధర్నా చేస్తున్న రైతును తొక్కి చంపిన పోలీసుల వీరంగం, కోట్ల ధనం దోపిడీ- ఇవన్నీ మనం రోజూ చూసే సుందర దృశ్యాలు. పాతికేళ్ళ లోపునే మందు తాగే విచక్షణ యువకులకు ఉన్నదని వీరి వాదన. టీవీలో ఈ చర్చ వీలయినంత అసహ్యంగా, అసందర్భంగా, ఆలోచనారహితంగా కనిపించింది నాకు.
పూర్తిగా చదవండి
Monday, June 20, 2011
పుణ్య దొంగలు
'దొంగలందు మంచి దొంగలు వేరయా ' అన్నారు పెద్దలు. ఒకాయనకి తరుచుగా ఫోన్ కాల్స్ వచ్చేవి. అటు పక్క పెద్దమనిషి 'నమో వెంకటేశ!' అని మొదలెట్టి "బాబూ! తిరుమల తిరుపతి దేవస్థానం ఫోన్ నంబరు చెప్పగలరా!?" అని అడిగాడు. అటువంటి భక్తుడు అడిగితే కాదనలేక తెలుసుకుని మరీ చెప్పాడీయన. రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆ భక్తుడే ఫోన్ చేసి 'జై శ్రీరాం!' అంటూ బిర్లామందిర్ నంబరు అడిగాడు.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Monday, June 13, 2011
వయస్సుని జయించినవాళ్ళు
ఉదయం పార్కులో నడిచే మిత్రులలో నోరి రామకృష్ణయ్యగారొకరు. ఆయన వయస్సు 82. ఆ మధ్య హిందీ ప్రచార సభ స్నాతకోత్సవాన్ని చూశారు. అక్కినేని ముఖ్య అతిధి. పట్టభద్రులందరికీ ముతక ఖద్దరు శాలువాలు కప్పారట. శాలువాకి నాలుగు అంచుల్లో మూడు హృదయాలు (ఆటీన్లు) ముద్రలుంటాయి. "ఏక్ రాష్ర్ట భాషా హిందీ హో, ఏక్ హృదయ్ హో భారత జననీ" (హిందీ రాష్ర్ట భాష, భారతమాత హృదయం) అని రాసి ఉంటుంది. ఆ శాలువా కొనుక్కోవాలని హిందీ ప్రచార సభకి వెళ్ళారు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Subscribe to:
Posts (Atom)